ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతన్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 304 బంతుల్లో 25 ఫోర్లు, 5 సిక్సుల సాయంతో 202 పరుగులు చేశాడు. టెస్టుల్లో మయాంక్ అగర్వాల్కు ఇది రెండో డబుల్ సెంచరీ. ఈ మ్యాచ్లో మయాంక్ సిక్స్తో డబుల్ సెంచరీ సాధించడం విశేషం. మయాంక్ డబుల్ సెంచరీతో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. ప్రస్తుతం 102 ఓవర్లకు గాను టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 376 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ అగర్వాల్(211), రవీంద్ర జడేజా(14) పరుగులతో ఉన్నారు.