తెలుగుదేశం పార్టీ నుంచి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని సస్పెండ్ చేశారు. వంశీని టీడీపీ నుంచి పార్టీ అధినేత చంద్రబాబు సస్పెండ్ చేశారు. చంద్రబాబు, లోకేశ్ పై నిన్న విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని టీడీపీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంది. వంశీ అంశంపై ఈ రోజు చర్చించిన చంద్రబాబు... ఆయనను సస్పెండ్ చేయాలని నిర్ణయించారు.