ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ అసెంబ్లీకి తరలిస్తున్న ఫర్నీచర్, ఏసీలు చోరీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 20, 2019, 11:43 AM

ఏపీ రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని 2017, మార్చిలో అమరావతికి తరలించారు. ఈ సందర్భంగా అసెంబ్లీకి చెందిన కొంత ఫర్నీచర్ తో పాటు ఏసీలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమరావతిలోని తాత్కాలిక అసెంబ్లీకి హైదరాబాద్ నుంచి ఫర్నీచర్ ను తరలిస్తుండగా, కొంత మాయమైందని అసెంబ్లీ కార్యదర్శి ఫిర్యాదులో తెలిపారు. కాగా, టీడీపీ నేత కోడెల శివప్రసాద్ స్పీకర్ గా ఉన్నప్పుడే ఈ ఫర్నీచర్ మాయమయిందని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫర్నీచర్, ఏసీలను సత్తెనపల్లి, నరసరావుపేటలకు తరలించినట్లు గట్టిగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com