లండన్లో జరుగుతున్న క్రికెట్ ప్రపంచకప్ పోటీల్లో భాగంగా జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా శ్రీలంకపై 87 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 334 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే ఆసిస్ నిర్దేశించిన 335 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక తడబడి వడి వడిగా వికెట్లు కోల్పోయి, 45.5 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటు కావటంతో ఆసిస్ విజయతీరాలకు చేసింది. కాగా కెప్టెన్ దిముత్ కరుణరత్నె 108 బంతులు ఎదుర్కొని 9 ఫోర్ల సాయంతో 97 పరుగులు చేసి, రిచర్డ్సన్ బౌలింగ్లో మ్యాక్స్వెల్కు క్యాచ్ ఇచ్చి కరుణరత్నె అవుటయ్యాడు. దీంతో మూడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్న్టయ్యింది.