మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు కు గన్నవరం విమానాశ్రయంలో జరిగిన అవమానం పట్ల తెదేపా ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసారు. శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, వెలగపూడి రామకృష్ణబాబు ప్రభుత్య చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. జడ్ప్లస్ కేటగిరి భద్రత కలిగిన చంద్రబాబును ..సాధారణ ప్రయాణికులు వెళ్లే దారిలో పంపించడం, తనిఖీలు చేయడం దారుణమని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ పాదయాత్ర చేస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి భద్రత కల్పించామని గుర్తు చేశారు. నిరసన ప్రదర్శన అనంతరం జిల్లా కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు.