బీజింగ్: అంతరిక్ష ప్రయోగాల్లో చైనా మరో ముందడుగు వేసింది. షిప్ నుంచి రాకెట్ ప్రయోగాన్ని చైనా విజయవంతంగా ప్రయోగించింది. చైనా ఇటువంటి ప్రయోగం చేయడం ఇదే మొదటిసారి. ఎల్లో సముద్రం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టింది. లాంగ్ మార్చ్ 11 రాకెట్ ద్వారా మొత్తం ఏడు శాటిలైట్స్ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. వీటిలో సముద్ర ఉపరితల గాలులు, తుఫాన్ల అధ్యయనానికి సంబంధించిన శాటిలైట్ ఒకటి కాగా.. మరో రెండు కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఉన్నాయి. ఇటీవలి కాలంలో అంతరిక్ష రంగంపై చైనా భారీగా పెట్టుబడులు వెచ్చిస్తుంది. 2030 నాటికి అమెరికాను అందుకోవడంతో పాటు అంతరిక్షరంగంలో ప్రముఖ స్థానంగా నిలవాలనుకుంటుంది. అదేవిధంగా వచ్చే ఏడాది సొంత నిర్వహణతో స్పేస్ స్టేషన్ను నిర్మించతలపెట్టింది.