ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్‌తో అజయ్‌ కల్లం భేటీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 05, 2019, 01:22 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం... తాడేపల్లిలోని ఆయన నివాసంలో సీఎం జగన్‌ను కలిసిన అజయ్ కల్లం.. తనను సీఎం ముఖ్య సలహాదారుగా నియమించినందుకు మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి... తన ముఖ్య సలహాదారుగా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం నియమించుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది ప్రభుత్వం. దీంతో ఆయన సీఎంవోకి అధిపతిగా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శులుగా వ్యవహరించే అధికారుల మధ్య పని విభజన, వారు ఏయే శాఖల బాధ్యతలు నిర్వహించాలో ఆయనే నిర్దేశిస్తారు. ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com