వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనపై చేసిన ఆరోపణలను ఖండించారు.. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వర్రావు. తాను గానీ తన కుటుంబ సభ్యులు గానీ ఎలాంటి ప్రభుత్వ కాంట్రాక్ట్లు చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ – ప్రగతి ప్రాజెక్ట్లో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని వెంకటేశ్వర్రావు హెచ్చరించారు.