ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ అవార్డ్ ప్రణయ్‌కి అంకితం :డాక్టర్ ఆనంద్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 15, 2019, 10:27 PM

అంబేద్కర్ 128 వ జయంతి పురస్కరించుకుని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సంయుక్తంగా.. వివిధ రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన విశేష వ్యక్తులకు అంబేద్కర్ సేవారత్న జాతీయ అవార్డ్‌లను అందజేయడం జరిగింది. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన డాక్టర్ ఆనంద్ ఈ అవార్డ్ అందుకున్నారు.
డాక్టర్ ఆనంద్ ఇప్పటి వరకు బాలికా విద్య, మానవ హక్కుల పరిరక్షణ, మహిళా సాధికారతలను కథాంశాలుగా ఎంచుకుని ‘అంటు రానితనం’. ‘చిరు తేజ్ సింగ్’ లాంటి లఘు చిత్రాలు రూపొందించారు. ఈ చిత్రాలకు జాతీయ స్థాయి అవార్డ్‌లు కూడా లభించడం విశేషం. వీటితో పాటు జ్యాత్యహంకార దాడులకు వ్యతిరేకంగా, ర్యాగింగ్‌కు వ్యతిరేకంగా పలు మ్యూజిక్ వీడియోలను కూడా రూపొందించి అశేష ప్రేక్షకాదరణ పొందారు. మరోవైపు డాక్టర్‌గా కూడా ఆయన అందించిన విశేష సేవలకు గానూ ఈ అవార్డు ఆయనకు దక్కింది. కాగా న్యూఢిల్లీలో ఈ వేడుక అతిరథమహారధుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.
మరోవైపు అవార్డు అందుకున్న డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ.. ఈ అవార్డ్‌ను ఇటీవల కులాంతర వివాహం చేసుకున్నాడనే కారణంగా దారుణ హత్యకు గురైన మిర్యాలగూడకు చెందిన ప్రణయ్‌కి అంకితమిస్తున్నట్లుగా తెలిపారు. కాగా ఈ అవార్డు అందుకోవడానికి తనకు అన్ని రకాలుగా సహకరించిన మిత్రులకు కృతజ్ఞతలు తెలిపాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com