తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి తప్పుబట్టారు. ఈమేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ట్వీట్ చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించే వరకు విశ్రమించమని చెప్పిన ఉదయనిధి స్టాలిన్ పార్టీతో కాంగ్రెస్ అంటకాగుతుందని ఆరోపించారు.
సనాతన ధర్మంపై ఆయన గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని.. ఇండియా కూటమి మాత్రం ఆయనను తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా నియమించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ తీరును తప్పుబడుతూ ఆయన వ్యాఖ్యల వీడియోను ట్విట్టర్లో పురందేశ్వరి పోస్ట్ చేశారు.