ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నెయ్యి కల్తీ జరగలేదని జగన్ ఎలా చెబుతారు?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 09:40 PM

శ్రీవారి లడ్డూ అపవిత్రతపై ‘‘గోవు ఘోష వినండి గోవిందా’’ కార్యక్రమం సందర్భంగా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో సుందర గోవిందుడు ఆలయంలో గోవులకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ... జగన్ హిందుత్వం మీద హేయమైన భాషలో మాట్లాడారని మండిపడ్డారు. ఇదేం హిందుత్వం ఇదేమి భారతదేశమని మాజీ సీఎం జగన్ మాట్లాడారని .. ఈ రెండు మాటలను జగన్ వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు.


320 రూపాయలకు అసలు నెయ్యి వస్తుందా అని ప్రశ్నించారు. అసలు నెయ్యి కల్తీ జరగలేదని జగన్ ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఆ ధరకి ఆవు నెయ్యి వస్తుందా అని అడిగారు. రూ. 6 వేల కోట్ల బడ్జెట్‌లో నెయ్యికి రూ. 600 కోట్లు బడ్జెట్ ఖర్చుపెట్టడానికి జగన్ ఎందుకు ఆలోచించారని నిలదీశారు. హిందూ తత్వాన్ని కించపరిచేలా జగన్ వ్యాఖ్యలు చేయడం బాధాకరమని అన్నారు. డిక్లరేషన్‌లో సంతకం పెట్టి తిరుమల దర్శనానికి వెళ్లడానికి జగన్‌కి అంత ఇబ్బంది ఏంటని సోము వీర్రాజు ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com