క్రీడా శాఖ మంత్రిగా రోజా దోచేసిన మొత్తాన్ని కక్కిస్తానని శాప్ ఛైర్మన్ రవినాయుడు అన్నారు.రవి నాయుడికి పదవి వచ్చిన సందర్భంగా శనివారం సాయంత్రం తిరుపతిలో టీడీపీ, తెలుగు యువత శ్రేణులు భారీర్యాలీ నిర్వహించాయి.ఎస్వీయూనివర్శిటీ నుంచి నగర వీధుల మీదుగా మంగళం రోడ్డులోని రవినాయుడు నివాసం వరకు ర్యాలీ సాగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయల డబ్బును రోజాతో పాటు అప్పటి శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దోచేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో క్రీడా శాఖలో జరిగిన అవినీతి, అక్రమాలను బయటపెడతామన్నారు. రోజాతో పాటు బైరెడ్డిని జైలుకు పంపిస్తామన్నారు.ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీడీపీ నేతలు నరసింహ యాదవ్, ఊకా విజయకుమార్, శ్రీధర్ వర్మ, జేబీ శ్రీనివాస్, పులుగోరు మురళి, మహేష్ యాదవ్, వివేక్ తదితరులు పాల్గొన్నారు.