ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంఐడీసీ ప్రాంతంలోని ఉక్కు కర్మాగారంలో బాయిలర్ పేలుడు

national |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2024, 08:44 PM

ఒక ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది.  ఈ ప్రమాదంలో 22 మంది కార్మికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని జల్నాలో ఈ సంఘటన జరిగింది. శనివారం మధ్యాహ్నం ఎంఐడీసీ ప్రాంతంలోని ఉక్కు కర్మాగారంలో బాయిలర్ పేలింది. గజ్‌కేసరి స్టీల్‌ మిల్లులో ఈ సంఘటన జరిగింది. బాయిలర్‌ పేలుడు వల్ల కరిగిన ఇనుము కార్మికులపై పడిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో 22 మంది కార్మికులు గాయపడినట్లు చెప్పారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో వారికి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఐరన్‌ స్క్రాప్ నుంచి స్టీల్ కడ్డీలను ఈ ఫ్యాక్టరీలో తయారు చేస్తారని వివరించారు. గాయపడిన కార్మికుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి కంపెనీ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com