ఒక ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో 22 మంది కార్మికులు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని జల్నాలో ఈ సంఘటన జరిగింది. శనివారం మధ్యాహ్నం ఎంఐడీసీ ప్రాంతంలోని ఉక్కు కర్మాగారంలో బాయిలర్ పేలింది. గజ్కేసరి స్టీల్ మిల్లులో ఈ సంఘటన జరిగింది. బాయిలర్ పేలుడు వల్ల కరిగిన ఇనుము కార్మికులపై పడిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో 22 మంది కార్మికులు గాయపడినట్లు చెప్పారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.ఛత్రపతి శంభాజీనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వారికి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఐరన్ స్క్రాప్ నుంచి స్టీల్ కడ్డీలను ఈ ఫ్యాక్టరీలో తయారు చేస్తారని వివరించారు. గాయపడిన కార్మికుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి కంపెనీ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.