ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకల కోసం 25 వేలు..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 09, 2024, 07:07 PM

ఆగస్టు 15.. స్వాతంత్య్ర‌ దినోత్సవం దగ్గరకు వస్తున్న నేపథ్యంలో గ్రామగ్రామాన స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ వేడుకల నిర్వహణకు పంచాయతీలకు నిధుల పెంచినట్లు తెలిపారు. ఆగస్టు 15 కార్యక్రమాలకు రూ.100, రూ.250 ఇచ్చే మొత్తాలను రూ.10 వేలు, రూ.25 వేలకు పెంచారు. ఇప్పటి వరకూ మైనర్ పంచాయతీలకు రూ.100, మేజర్ పంచాయతీలకు రూ.250 ఇచ్చేవారు. ఇప్పుడు ఆ మొత్తాలను రూ.10 వేలు, రూ.25 వేలు చేెశామ‌న్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com