ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హరేకృష్ణ గోకుల క్షేత్రం అభివృద్ధికి నిధులు మంజూరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 13, 2024, 02:52 PM

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ హరే కృష్ణ గోకుల్ క్షేత్రానికి ఇవాళ ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో జరగనున్న అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. 150 కోట్ల రూపాయలతో హరేకృష్ణ గోకుల క్షేత్రం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోందన్నారు. ఇప్పటి వరకూ 20 ప్రాజెక్టులు ఇండియాలో ఉన్నాయన్నారు. హరే కృష్ణ మూమెంట్లో 50 మంది ఐఐటి గ్రాడ్యుయేట్స్ ఉన్నారన్నారు. నమ్మిన సిద్ధాంతాలకు జీవితాలను త్యాగం చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. అన్ని మతాలకు వారి వారి ప్రార్థనా ఆలయాలు లేకపోతే ఇప్పుడు ఉండే జైలు కూడా చాలవన్నారు. ఇలాంటి ప్రార్థనాలయాలు లేకపోతే సమాజంలో నేరాలు-ఘోరాలు విపరీతంగా పెరిగిపోతాయని చంద్రబాబు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com