అర్జెంటీనాలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. బ్యూనోఎయిర్స్ సమీపంలోని పలెర్మో పరిసరాల్లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కనీసం 60 మంది గాయపడినట్లు తెలుస్తోంది. అయితే ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు పేర్కొనలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. బ్యూనస్ ఎయిర్స్ మేయర్ జార్జ్ మాక్రి సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రాణనష్టం జరగలేదని తెలిపారు.