హనుమంతుడి ఆశీస్సుల వల్లే తాను జైలు నుంచి బయటకు వచ్చానని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. అందుకే రేపు ఉదయం 11 గంటలకు హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు. నియంతృత్వ పాలన నుంచి దేశాన్ని కాపాడేందుకు పోరాడతానని వెల్లడించారు.