ఎన్నికలు భారత్లో జరుగుతుంటే.. పాకిస్థాన్ గురించి ఎందుకు చర్చిస్తోందని బీజేపీని ఉద్దేశించి ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రచారంలో మతాలను ప్రస్తావిస్తోందని ఆరోపించారు. కులమతాల ప్రాతిపదికన ఎన్నికలు జరగాలని ప్రజలు కోరుకోవడంలేదని, స్థానిక సమస్యలే ప్రధాన ఎజెండాగా ఉండాలన్నారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సమస్యలు, కార్మికుల కష్టాలపై కమలదళం ఎందుకు చర్చించడం లేదని ఆమె నిలదీశారు.