ముద్దనూరు మండలం ఉమ్మారెడ్డి పల్లె గ్రామానికి చెందిన శివశంకర్, అతని భార్య తాడిపత్రి నుండి ఉమ్మారెడ్డిపల్లెకి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా శుక్రవారం ఉదయం కొండాపురం మండలం వెంకటాపురం వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొనిందని తాళ్ల ప్రొద్దుటూరు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. ఈ ప్రమాదంలో శివశంకర్ అక్కడికక్కడే మృతిచెందగా అతని భార్యకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స కోసం ఆమెను తాడిపత్రి పట్టణానికి తరలించినట్టు ఎస్సై తెలిపారు.