ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్ 21న ఆ సేవలకు అంతరాయం

business |  Suryaa Desk  | Published : Sat, Apr 20, 2024, 10:17 PM

ఎవరికైనా డబ్బులు పంపించాలన్నా ఇప్పుడు బ్యాంకుకు వెళ్లాల్సిన పని లేదు. చిటికెలో ఫోన్ ద్వారానే పంపించేస్తున్నాయి. అయితే, పెద్ద మొత్తంలో పంపిస్తున్నప్పుడు కొన్ని సార్లు బ్యాంకుకు వెళ్లాల్సి వస్తుంది. అలాగే చాలా వరకు సర్వీసెస్ అన్ని ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారానే పూర్తి చేస్తున్నాం. బ్యాంకు మూసి ఉన్న సందర్భంలోనూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే, కొన్ని సందర్భాల్లో ఆన్‌లైన్ సేవలకు సైతం అంతరాయం ఏర్పడుతుంది. ఈ క్రమంలో ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్  కీలక ప్రకటన చేసింది. మెయింటెనన్స్ కారణంగా పలు సేవలకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. ఏప్రిల్ 19, 2024 నుంచి ఏప్రిల్ 21, 2024 వరకు వివిధ మెయింటెనెన్స్ షెడ్యూల్ విడుదల చేసింది.


మెయింటెనెన్స్ షెడ్యూల్ లో భాగంగా నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంక్ యాప్ వంటి సేవలకు అంతరాయం ఏర్పడుతుందని తమ అధికారిక వెబ్‌సైట్ లో పేర్కొంది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్. ఏప్రలి 21, 2024వ తేదీన ఉదయం 1 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్  సేవలు అందుబాటులో ఉండవని బ్యాంక్ తెలిపింది. అలాగే ఉదయం 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నెట్ బ్యాకింగ్ సేవలు సైతం అందుబాటులో ఉండవని తెలిపింది. తమ కస్టమర్లకు ఎదురవుతున్న ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది.


బ్యాంకుకు సంబంధించిన సర్వర్లలో అప్డేట్ చేస్తున్న కారణంగా ఆర్‌టీజీఎస్ ట్రాన్సాక్షన్లు అందుబాటులో ఉండవని తెలిపిది. నెఫ్ట్  లేదా ల ద్వారా ట్రాన్సాక్షన్లు పూర్తి చేసుకోవచ్చని బ్యాంక్ తమ కస్టమర్లకు సూచించింది. మెయింటనెన్స్ కారణంగా ఏర్పడుతున్న అంతరాయానికి చింతిస్తున్నామని, దీనికి వినియోగదారులు సహకరించాలని బ్యాంక్ కోరింది. ఈ విషయంలో ఏదైనా సందేహాలు ఉంటే 18001600 లేదా 18002600 హెల్త్ లైన్ నంబర్ ద్వారా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com