కదిరి స్టేట్ బ్యాంక్ వ్యవసాయ శాఖ ఫీల్డ్ ఆఫీసర్ వెంకట నాయుడుపై అర్బన్ పోలీసులకు రీజనల్ మేనేజర్ వెంకటేశ్వర్ రావు బుధవారం ఫిర్యాదు చేశారు. అయన విధి నిర్వహణలో బ్యాంక్ ఒడి ఖాతా నుండి రూ. 1. 67 కోట్లు వారి బంధువుల ఖాతాల్లోకి మళ్లించి బ్యాంక్ లో మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.