దివ్యాంగులను చిన్నచూపు చూడొద్దండని అధికారులను అనంతపురం కలెక్టర్ గౌతమి ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స హాల్లో గురువారం దివ్యాంగుల జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమం కోసమే చట్టం మేరకు జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేశారన్నారు. అలాంటి కమిటీ దివ్యాంగుల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు వారికి అందేలా చూడాలన్నారు. కమిటీ సభ్యులకు ఈ చట్టంపై అవగాహన ఉండేలా చూడాలన్నారు. ఖాళీగా ఉన్న కమిటీలో నామినేటెడ్ సభ్యులను త్వరగా ఎంపిక చేయాలని వికలాంగుల శాఖ ఏడీ రసూల్కు కలెక్టర్ సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ దివ్యాంగుల రాకపోకలకు సౌకర్యంగా ఉండేలా ర్యాంప్లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఏఆర్డీఎస్పీ శ్రీనివాసులు, డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి, ఎల్డీఎం నాగరాజారెడ్డి, సీఈఓ భాస్కర్రెడ్డి, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి, డీపీఓ ప్రభాకర్రావు, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కిరణ్కుమార్ రెడ్డి, డీసీహెచఎ్స డాక్టర్ కృష్ణవేణి, పీఆర్ఎ్సఈ భాగ్యరాజ్ పాల్గొన్నారు.