ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈతకి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువకుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2023, 03:05 PM

కర్నూలు జిల్లా, గోనెగండ్ల మండలంలోని పెద్దనేలటూరు గ్రామానికి చెందిన విద్యార్థి చాకలి వేణుగోపాల్‌ (17) ఈతకు వెళ్లి మృతి చెందారు. వివరాల్లోకి వెళ్ళితే..... వేణుగోపాల్‌ మిత్రులతో కలిసి గ్రామ శివారులోని బావిలో ఈతకు వెళ్లాడు. ఈత కొడుతూ ప్రమాదవశాత్తు బావిలో మునిగిపోయాడు. తోటి స్నేహితులు కేకలు వేయగా బావి చుట్టు పక్కల వారు వచ్చి బావిలో వెతికారు. కొద్ది సేపటి తర్వాత బయటికి తీయగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. గ్రామానికి చెందిన శ్రీరాములు, సువర్ణ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా.. పెద్ద కుమారుడు వేణుగోపాల్‌ ఇంటర్మీడియేట్‌ పూర్తి చేశాడు. విద్యార్థి మృతితో ఆ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com