గొలుసు చోరీ కేసులో రిమాండ్ పై ఉన్న ఖైదీ పరారయ్యాడు. గన్నవరం సబ్ జైలులో పీటీ వారెంట్పై గరికే సుబ్బరాజు అలియాజ్ బ్లేడ్ అనే ఖైదీ ఉన్నాడు. సబ్ జైలులో ఉన్న సుబ్బారాజును తాడేపల్లిగూడెం కాళ్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తిరిగి సబ్ జైలులో అప్పగించే క్రమంలో అర్ధరాత్రి జైలు వద్దకు చేరుకోగానే పరారయ్యాడు. కేసరపల్లి, పలుచోట్ల గొలుసు చోరీ కేసుల్లో సుబ్బరాజు నిందితుడిగా ఉన్నాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు.