ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థినులను పరామర్శించిన జనసేన నాయకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 02:16 PM

సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఆర్కే పురం గ్రామంలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల హాస్టల్ లోని విద్యార్థులు ఒక్కసారిగా వాంతులు చేసుకుంటూ స్పృహ కోల్పోవడం జరిగింది. చికిత్స పొందుతున్న విద్యార్థిని లను మంగళవారం జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు నారదాసు ప్రసాద్, తోట రాజ రమేష్ మరియు సత్తెనపల్లి స్థానిక నాయకులు పరామర్శించారు. అనంతరం ఆర్కే పురం లోని బాలికల గురుకుల పాఠశాల లోకి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న విద్యార్థిని లను పరామర్శించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితి పై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com