ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘ‌నంగా ర‌థ‌స‌ప్త‌మి వేడుక‌లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 28, 2023, 12:51 PM

రథ‌సప్తమి పర్వదినం సందర్భంగా విశాఖ నగరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలన్న సదుద్దేశంతో "ఓం ఉచిత యోగా సెంటర్" వ్యవస్థాపకుడు, జిల్లా యోగ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ , యోగా మాస్టర్ చిలకా రమేష్ శనివారం ఉదయం సామూహిక 108 సూర్య నమస్కారాల కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. సూర్య భగవానుడు సమస్త జగత్ కు ఎంత ఆధారమై వున్నారో అలాగే ఈ సూర్యనమస్కారాల వ‌ల‌న కూడా మాన‌వుడు మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితి కి వెళ్ళడానికి చాలా ఉపయోగ పడతాయ‌న్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రా యూనవర్సిటీ యోగా డైరెక్టర్ భాను కుమార్, జిల్లా యోగ ప్రెసిడెంట్ యోగా రాజు , ఓం యోగ సంస్థ ప్రెసిడెండ్ వ‌సంతరామ్ , సురేష్ బాబు, బీజేపీ జిల్లాఅధ్యక్షుడు మేడపాటి రవీంద్ర త‌దిత‌రులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com