ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాడికి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Nov 12, 2022, 08:54 AM

అమ్మా ఎలా ఉన్నారు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్ర మంలో ప్రజలతో మమేకమయ్యారు. నాయకులు, అధికారులతో కలిసి మండల పరిధిలోని పిన్నేపల్లెలో శుక్రవారం ఉదయం పర్య టించారు. ప్రజలను ఆత్మీయంగా పలకరిస్తూ మూడున్నరేళ్ల పాలనలో అందించిన లబ్ధిని వివరిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లా డుతూ గతంలో జన్మభూమి కమిటీల అండదండల తోనే ప్రజలకు సంక్షేమ పథకాలు అందాయని, కానీ నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పార్టీల కతీతంగా అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు గ్రామ వలంటీర్ల ద్వారా నేరుగా అందుతున్నాయ న్నారు. ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసు కొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటానన్నారు. కాలనీలో డ్రైనేజీ సమస్య అధికంగా ఉందని ఎమ్మెల్యే దృష్టికి ప్రజలు తీసుకురాగా పరిష్కరిం చాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com