ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్యశ్రీలో 3 వేలకు పైగా వ్యాధులకు చికిత్స

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 24, 2022, 02:20 PM

హెల్త్ విషయంలో వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వం చాలా శ్రద్ధ తీసుకుంటుంద‌ని మంత్రి బొత్స సత్యనారాయణ  తెలిపారు. ఆరోగ్యశ్రీలో 3 వేలకు పైగా వ్యాధులకు చికిత్స అందిస్తున్నాం. ఇంకా ఏమైనా వ్యాధులు మిగిలిపోతే వాటిని కూడా చేర్చేందుకు ఆలోచన చేస్తున్నామ‌న్నారు.  ఈ సంద‌ర్భంగా పిల్లలకు వినికిడి పరికరాలను మంత్రి అందజేశారు. దేశంలోనే ఎక్కువ మంది బాధితులు విజయనగరంలోనే ఉన్నారన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇలాంటి సమస్యను ఏ విధంగా అధిగమించాలా అనే ఆలోచన చేస్తున్నాం. అందుకు గర్భం సమయంలోనే ఈ సమస్యను నివారించేందుకు ప్రోటీన్ ఫుడ్ ను ప్రభుత్వం సమకూరుస్తుంది. మేనరికాలు కూడా దూరంగా పెట్టండి. ఆ విధంగా చైతన్యవంతుల్ని చేయాలి. ఐదేళ్ల లోపు ఉన్న 500 మంది పిల్లలకు సీఎం ఆర్ ఎఫ్ నిధులు, ఆరోగ్య శ్రీ నుండి ఆపరేష‌న్స్ చేస్తున్నాం. రూ.30 కోట్ల ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామ‌ని, ఈ ఆవకాశం అందరూ వినియోగించుకోవాల‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com