ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాకప్ లో ఖైదీ మృతి.. మాట్లాడుతూ మరణించాడు

national |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 12:44 PM

బీహార్​లోని కాటిహార్​ జిల్లా ప్రాణ్​పుర్​ పోలీస్ స్టేషన్ ​లో ఓ ఖైదీ మరో వ్యక్తితో మాట్లాడుతూ అకస్మాత్తుగా మరణించాడు. ప్రమోద్ అనే అక్రమ మద్యం స్మగ్లింగ్​ కేసు నిందితుడు లాకప్ లోనే కన్నుమూశాడు. మరో వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నట్టుండి పడిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్​ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​ గా మారింది. దీంతో మృతుని గ్రామస్థులు పోలీస్​స్టేషన్​పై దాడి చేశారు. 10 మంది పోలీసులకు గాయాలయ్యాయి. వైరల్ అవుతున్న వీడియోపై దర్యాప్తు చేపట్టామని కాటిహార్​ ఎస్​ఐ జితేంద్ర తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com