ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిజాయితీ చాటుకున్న పదవ తరగతి విద్యార్థులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 12:45 PM

అనంతపురం నగరంలో పదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు తమ నిజాయితీని చాటుకున్నారు. నర్సినాయని కుంట గ్రామానికి చెందిన హరి ప్రసాద్ నాయక్, బహర్ నబా నాయక్ రుద్రంపేట సమీపంలోని జడ్పీ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్నారు. వారు రుద్రంపేట లో ఉన్న ఎస్టీ బాయ్స్ హాస్టల్ లో ఉంటారు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో వారు కొన్ని వస్తువులు కొనేందుకు బయటకు వచ్చారు. ఈ సమయంలో వారికి ఒక సెల్ ఫోన్ దొరికింది. వెంటనే ఆ సెల్ ఫోన్ తీసుకొని వారు వెళ్లకుండా నేరుగా నాలగవ పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులకు అందజేశారు. అక్కడే ఉన్న సిఐ జాకీర్ హుస్సేన్ విద్యార్థులతో సమాచారం ఆరా తీశారు. విద్యార్థుల నిజాయితీ చూసి వారిని అభినందించారు. చిన్న వయసులోనే ఇంత బాధ్యతగా వ్యవహరించిన విద్యార్థులు తోటి పిల్లలకు ఆదర్శంగా ఉంటారని సిఐ జాకీర్ హుస్సేన్ అభిప్రాయపడ్డారు. వెంటనే సెల్ ఫోన్ ఎవరిది అన్నది గుర్తించి బాధితులకు అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com