ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్థిక ఇబ్బందులతో ఒకరి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 22, 2022, 10:36 AM

ఆర్థిక ఇబ్బందులతో ఒకరు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి పట్టణంలోని ఆదర్శనగర్ లో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా చీమకుర్తి ప్రాంతానికి చెందిన వల్లెపు శ్రీహరి కుటుంబం బతుకుదెరువు కోసం వచ్చి కొద్ది రోజులుగా కామారెడ్డిలో నివాసం ఉంటుంది. శ్రీహరి ఇటీవల ఏ పని చేయకుండా మద్యానికి బానిసయ్యాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య రోజా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ ఎస్ హెచ్ వో పి. నరేష్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com