ప్రధాని నరేంద్ర మోదీ నుంచి తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు అభినందన లేఖ అందింది. తెలంగాణలో చేపడుతోన్న మిషన్ భగీరథ, స్వచ్ఛభారత్ కార్యక్రమాలను ప్రశంసిస్తూ మోదీ లేఖ రాశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమం పట్ల స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు. ‘స్వచ్ఛత హి సేవా’ ఉద్యమంలో పాల్గొనాలని కేటీఆర్కు ఆహ్వానించారు. కేటీఆర్ తన అనుభవాలను నరేంద్ర మోదీ యాప్లో పంచుకోవాలని లేఖలో పేర్కొన్నారు.