హాజీపూర్ మండలంలోని రాపల్లికి చెందిన సింగ చిన్నయ్య అనే రైతుపై అడవి పంది దాడి చేసింది. ఆదివారం తన పత్తి చేనును పరిశీలించేందుకు వెళ్లగా అప్పటికే చేనులో ఉన్న అడవి పంది ఒక్కసారిగా చిన్నయ్యపై దాడికి పాల్పడింది. ఇది గమనించిన చుట్టుపక్కల రైతులు అరుస్తూ వెళ్లగా భయంతో పారిపోయింది. గాయపడిన చిన్నయ్యను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.