మంచిర్యాల పట్టణంలోని గోదావరి నది తీరంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మృతురాలిని స్థానిక పాత మంచిర్యాలకు చెందిన ధరణి పద్మగా గుర్తించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న పద్మ ఈ నెల 25న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయి కనిపించకుండా పోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు ఆమె కోసం వెతకగా ఆదివారం గోదావరిలో శవమై తేలింది. ఈ మేరకు ఎస్సై ప్రశాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.