రాష్ట్ర స్థాయి మారధాన్ లో భిక్కనూరు విద్యార్థులు ప్రతిభ చూపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ఐదు కిలోమీటర్ల పరుగు పందెంలో రవళి, నిహారిక తొలి రెండు స్థానాలలో నిలిచి ప్రోత్సాహక బహుమతులతో పాటు నగదును గెలుచుకున్నారు. ఈ సందర్భంగా కోచ్ భరత్ మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినిలు భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.