అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ కోర్సులలో ప్రవేశానికి వచ్చే నెల 18వ తేదీ చివరి తేదీ అని వర్సిటీ కామారెడ్డి స్టడీ సర్కిల్ సమన్వయకర్త రాజ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ రెండో, మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ ఫీజును ఆగస్టు 18 లోగా ఆన్లైన్లో చెల్లించాలని సూచించారు. 2015-16 విద్యా సంవత్సరం నుంచి 2023-24 విద్యా సంవత్సరం వరకు వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొంది ఫీజులు చెల్లించలేకపోయిన వారు సైతం ఈ అవకాశాన్ని వినియోగించుకొని పరీక్షలు రాయవచ్చని తెలిపారు.