తెలంగాణలో బీఆర్ఎస్ ని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పు వణుకు పుట్టిస్తుంది. పార్టీ మారినవారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. అయితే గతంలో ఇతర రాష్ట్రాలలో స్పీకర్లు అనర్హత వేటు విషయంలో కాలయాపన చేయడంపై సుప్రీం కోర్టు తప్పుపట్టింది. విచక్షణ అధికారం పేరుతో సాగదీయకూడదని వారికి 90 రోజుల వ్యవధిని నిర్ణయించింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వారికి 90రోజుల్లో అనర్హత వేటు పడే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.