తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, మంత్రి శ్రీధర్బాబు అమెరికా పర్యటన నేపథ్యంలో ఆదివారం ఆగష్టు 4న ఇండియన్ కమ్యూనిటీ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సమావేశం జరగనుంది. ఈ సమావేశ సన్నాహాల్లో భాగంగా నిర్వాహక బృందం జూలై 28 ఆదివారం రాయల్ అల్బెర్ట్స్ పాలస్ సందర్శించారు. దాదాపు మూడు వేల మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరు కానున్న ఈ సమావేశానికి చెయ్యాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించినట్లు తెలిపారు.