ఏపీలో ఎంత బలంగా ఉందో చెప్పలేం కానీ.. తెలంగాణలో మాత్రం టీడీపీ ప్రజల గుండెల్లో ఉందని అంటారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా తెలంగాణలో టీడీపీకి బలం ఉందనేలా 2014, 2018 ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అయితే, బీఆర్ఎస్ అనుసరించిన విధానాలతో క్రమంగా ఆ పార్టీ నాయకులను కోల్పోయింది. అయితే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా బీసీ సామాజికవర్గానికి చెందిన అరవింద్ కుమార్ గౌడ్కు పగ్గాలు అప్పగించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.