పేద ప్రజలకు సంక్షేమ పథకాలు, గ్రామాల అభివృద్ధి కొరకు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు లింగప్ప అన్నారు. బుధవారం దామరగిద్ద మండలం మద్దెలబీడు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాల కర పత్రాలను ప్రజలకు అందించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా చల్ల వంశీచంద్ రెడ్డిని గెలిపించాలని ఓటరును కోరారు. నాయకులు పాల్గొన్నారు.