నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండ గ్రామ శివారులోని చెక్ డ్యాంలో సోమవారం ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందిన విషాదఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన వారిలో రాకొండ గ్రామానికి చెందిన రాధిక (19), పాతర్ చేడ్ గ్రామానికి చెందిన శ్రావణి (14), మహేశ్వరి (13) ఉన్నారు. ముగ్గురు మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా సోమవారం ఒక్కే రోజు ఉమ్మడి పాలమూరులో నీటమునిగి ఆరుగురు మృతిచెందారు.