మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తీర్ణ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించారని, ప్రస్తుతం విగ్రహాన్ని యధాస్థితిలో పునరుద్దరణ చేయాలని టీడీపీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మెట్టుకాడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఆధ్వర్యంలో టీడీపీ ప్రతినిధి బృందం జిల్లా అడిషనల్ కలెక్టర్ సీతారామారావుకు ప్రజావాణిలో వినతిపత్రం అందజేసినారు. కార్యక్రమంలో నాయకులు బాలప్ప, కాసీం, పట్టణ అధ్యక్షులు చెన్నయ్య, గట్టు రాముడు, మురళి, కేశవులు, ఖాసీం బాబా, పిల్లి శ్రీహరి, లక్ష్మయ్య, మోహన్, బందెన్న, తిరుమలయ్య, సలీం తదితరులు పాల్గొన్నారు.