ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెడ్ క్రాస్ సేవలు అమూల్యం: లక్ష్మీ కాంత్ రాథోడ్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 08, 2023, 08:10 PM

మానవత్వమే మహోన్నత ఆశయంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలు అమూల్యమైనవని పాలమూరు విశ్వ విద్యాలయం ఉప కులపతి డాక్టర్ లక్ష్మీ కాంత్ రాథోడ్ అన్నారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం, తలసేమియా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సోమ వారం రెడ్ క్రాస్ కార్యాలయంలో రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నట రాజు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ఉప కుల పతి లక్ష్మీ కాంత్ రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ వ్యవ స్థాపకులు జాన్ హెన్రీ డ్యునాంట్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం రెడ్ క్రాస్ జెండాను ఆవిష్కరించారు. జూనియర్ రెడ్ క్రాస్ ద్వారా సేవలందిస్తున్న సమన్వయ కర్తలు అశ్విని చంద్రశేఖర్ , పి. బాల లింగయ్య, కె. అశోక్ కుమార్ , రాజేశ్వరి లకు రాష్ట్ర గవర్నర్ అందించిన సర్టి ఫికెట్ల ను ప్రదానం చేశారు. అదే విధంగా డిగ్రీ కళాశాలల కు వివిధ అంశాలపై నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు , యూత్ రెడ్ క్రాస్, జూనియర్ రెడ్ క్రాస్ వాలిoటర్లకు సరిఫికెట్లు, మెడల్స్ ను ప్రదానం చేశారు. అనంతరం ఉప కులపతి మాట్లాడుతూ సమాజానికి రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలు అమోఘ మని అన్నారు. ప్రతి ఒక్కరూ రెడ్ క్రాస్ సేవా కార్య్రమాల్లోనూ పాలు పంచుకోవాలని కోరారు. కళాశాలల్లో రక్త దాన శిబిరాలు నిర్వహించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తానని అన్నారు. ఇదిలా ఉండగా ఎస్ వి ఎస్ మెడికల్ కాలేజికి చెందిన వైద్య విద్యార్థులు తేజస్వి, కుసుమ, సాయి ప్రసాద్, హరీష్ కుమార్ లకు రెడ్ క్రాస్ శాశ్వత సభ్యులుగా సభ్యత్వం స్వీకరించారు. అంతకు ముందు సి పి ఆర్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో. రెడ్ క్రాస్ చైర్మన్ న ట రాజ్, కోశాధికారి జగపతి రావు, మేనేజింగ్ కమిటీ సభ్యులు రమణయ్య, జూనియర్, యూత్ రెడ్ క్రాస్ సమన్వయ కర్తలు అశ్విని చంద్రశేఖర్, పి. బాల లింగయ్య, అశోక్ , రాజేశ్వరి, మేనేజర్ చంద్ర శేఖర్, రెడ్ క్రాస్ సిబ్బంది తది తరులు పాల్గొన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com