మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జీఎంఆర్ కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను విమర్శించే స్థాయి లేదని 'ఆయన గతంలో తన ఇంటిపక్క వున్న గిర్నిలో తౌడు దొంగతనం చేసి ఆకలి తీర్చుకున్న దొంగ' అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మహబూబ్ నగర్ జిల్లా రైతు సమితి అధ్యక్షుడు గోపాల్ యాదవ్ ఘాటుగా విమర్శించారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులుతో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం లో వెనకడుగు వేయకుండ ముందుకు సాగుతూ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజా సేవకు అంకితమైన శ్రీనివాస్ గౌడ్ ను విమర్శించడం మంచిది కాదని హితవు పలికారు. మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ అభివృద్ధి చెందుతోందని తెలిపారు. గతంలో పట్టణంలో 14 రోజులకు ఒకసారి మంచినీరు వచ్చేదని ఇప్పుడు ప్రతిరోజు మంచినీరు వస్తుందని తెలిపారు. హన్వాడ మండలం నాయకుడు జములయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత నౌకర్లుగా వున్న వారంతా యాజమానులుగా మారారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ ఇన్ ఛార్జ్ ఎద్. వినోద్ కుమార్ తన పద్దతులు మార్చుకోవాలని లేకపోతే బీఆర్ఎస్ నేతలు చూస్తూ ఉండబోరని, ఉరికిచ్చికొడతారని అంటూ హెచ్చరించారు.