ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉప్పు, నిప్పుగా వాళ్ళ నాటకం: రేవంత్ రెడ్డి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 01:35 PM

ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయనకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో భాజపా, తెరాస విఫలమయ్యాయని రేవంత్ విమర్శించారు. ఆ రెండు పార్టీలు ఉప్పు, నిప్పుగా ఉన్నట్లు నటకాలాడుతున్నాయని. కానీ వాళ్ళ చీకటి బంధం ప్రజలకు తెలుసన్నారు. బహిరంగ లేఖ లో 9 అంశాలను ప్రస్తావిస్తూ వాటికి ప్రధాని సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో తెలంగాణ ఏర్పాటు గురించి అవమానించెల మోదీ మాట్లాడారని. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని. దాన్ని ప్రధాని ఎందుకు ఉపేక్షిస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు. నిజామాబాద్ లో పసుపు బోర్డ్ ఏర్పాటు, ఐటీఐఆర్ ప్రాజెక్టు, కృష్ణ జలాల అంశంతో జరుగుతున్న నష్టం, గిరిజన విశ్వవిద్యాలయం, ఆదిలాబాద్ లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మూసివేత, యాసంగి ధాన్యం కొనుగోలు, రామాయణం సర్క్యూట్ లో భద్రాద్రికి చోటు కల్పించకపోవడం తదితర అంశాలపై రేవంత్ రెడ్డి ప్రశ్నలు సంధించారు. వీటికి ప్రధాని మోదీ సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com