ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 26, 2022, 01:56 PM

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పాలన చేసేవారే దేశద్రోహులని, టీఆర్ఎస్ పాలన అంతా అవినీతిమయం అని అన్నారు. కుటుంబ పాలన దేశ ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం అని ప్రధాని అన్నారు. తెలంగాణలో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవిష్యత్తు కోసం మేం పోరాడతాం, తెలంగాణలో మార్పు వస్తుందని ప్రధాని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తప్పకుండా వస్తుందని అన్నారు. కుటుంబ పాలన ముగిసిన చోటే అభివృద్ధి జరుగుతుందని అన్నారు.

కేంద్ర పథకాల పేర్లు మార్చి తెలంగాణలో అమలు చేస్తున్నారని ప్రధాని అన్నారు. కేంద్ర పథకాల పేర్లు మార్చినా ప్రజల మనసులోంచి తమను తీసివేయలేరని అన్నారు. పథకాల్లో రాజకీయాలు చేస్తే ప్రజలు నష్టపోతారని అన్నారు. ఓ పార్టీకి గులాంగా మారి టీఆర్ఎస్ పనిచేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. తాను మూఢ నమ్మకాలని నమ్మనని, టెక్నాలజీని నమ్ముతానని ప్రధాని అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com