హైదరాబాద్: మాజీ మంత్రి మాదాటి నరసింహా రెడ్డి(85) నిన్న రాత్రి హైదరాబాద్లోని ఆయన నివాసంలో మరణించారు. ఆయన గత కొద్ది కాలంగా అనారోగ్య సమస్యలతో భాద పడుతున్నట్లు సమాచారం. ఆయన భూపాలపల్లి జిల్లా, మొగుళ్లపల్లి మండలం, మొసలపల్లి గ్రామ వాస్తవ్యులు. నరసింహారెడ్డి దివంగత, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఆయన మృతి పట్ల కరీంగనర్ మాజీ ఎంపీ, ప్రస్తుత ప్లానింగ్ కమిషన్ వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు.