కోలీవుడ్ స్టార్ హీరో శింబు సినిమాలలో హీరోగా నటించడమే కాక అప్పుడప్పుడు తన గొంతును సవరించుకుని పాటలు కూడా పాడుతుంటాడు. జూనియర్ ఎన్టీఆర్ బాద్షా, మంచు మనోజ్ "పోటుగాడు", రామ్ ది వారియర్ చిత్రాలలో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన శింబు లేటెస్ట్ గా తలపతి విజయ్ వారిసులో కూడా ఒక పాట పాడారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో, దిల్ రాజు నిర్మాణసారధ్యంలో రూపొందుతున్న వారిసు మూవీలో విజయ్, రష్మిక మండన్నా జంటగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్గా రిలీజైన రంజితమే చార్ట్ బస్టర్ గా నిలవడంతో సెకండ్ సింగిల్ పై చాలా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇప్పుడు ఈ పాటను శింబు పాడాడని ప్రచారం జరుగుతుండడంతో, అంచనాలు పీక్ స్టేజ్ కు చేరుకున్నాయి. మరి, త్వరలోనే వారిసు సెకండ్ సింగిల్ అప్డేట్ రావాలని విజయ్ అభిమానులు కోరుకుంటున్నారు.