కమల్ హాసన్ - శంకర్ల ఐకానిక్ మూవీ "ఇండియన్" సీక్వెల్ ఇటీవలే పునఃప్రారంభించబడిన విషయం తెలిసిందే కదా. ఈ మూవీలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
బాబు పుట్టిన తరవాత ఈ సినిమాతోనే కాజల్ రీఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీలో తన రోల్ కోసం కాజల్ మూడేళ్ళ నుండి కలరియపట్టు విద్యను నిపుణుల పర్యవేక్షణలో నేర్చుకుంటుందట. ఈ సినిమా మధ్యలో ఆగిపోయి, మళ్ళీ ఇటీవలే స్టార్ట్ అవ్వడంతో మరోసారి, కాజల్ కలరియపట్టు క్లాసెస్ కి అటెండ్ అవుతుంది.
ఈ నేపథ్యంలో తాను కలరియపట్టు విద్యలో ఏ మేరకు రాణించిందో ఆడియన్స్ కు చూపిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేసి, కలరియపట్టు విద్య గొప్పతనం గురించి చెప్పుకొచ్చింది కాజల్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.