చంద్రగిరి : జగన్ పాదయాత్ర నేటితో 60 రోజులకు చేరుకుంది. శుక్రవారం ఉదయం చంద్రగిరి నియోజకవర్గం పాత వేపకుప్పం శివారు నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి ఎల్వీ పురం క్రాస్, నేతకుప్పం, తిమ్మరాజుపల్లి, గొల్లపల్లి, సి. కాలేపల్లికి చేరుకుంటుంది. 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. విరామం అనంతరం మధ్యాహ్నం 3గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి చిటతూరు, హరిజనవాడ, రాయలచెరువుల మీదుగా కుప్పం బాదురు వరకూ పాదయాత్ర కొనసాగుతుంది.